వైవాకలో వివాహిత ఆత్మహత్య

6 Apr, 2018 09:51 IST|Sakshi
ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ప్రశాంతి

ముదినేపల్లి రూరల్‌(కైకలూరు): వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన  మండలంలోని వైవాకలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ముదినేపల్లి ఎస్‌ఐ వి.రాజేంద్రప్రసాద్‌ కథనం మేరకు.. గ్రామానికి చెందిన దేవిశెట్టి నాగబాబుకు గూడూరు మండలం తరకటూరుకు చెందిన ప్రశాంతి(29)తో పదేళ్ల కిందట వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. గతంలో ప్రశాంతిని భర్త నాగబాబు కట్నం వేధింపులకు గురిచేయగా మచిలీపట్నం మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.పెద్దలు రాజీ కుదిర్చి తిరిగి కాపురానికి పంపగా వైవాకలో అద్దె ఇంటిలో కాపురముంటున్నారు. ప్రశాంతి మరిది వివాహం నాలుగు రోజుల క్రితం జరగ్గా ఈ వివాహానికి అత్తమామలు ఆహ్వానించలేదు. భర్త బలవంతంపై వివాహానికి వెళ్ళి వచ్చింది. ఇది అవమాన భారంగా భావించిన ప్రశాంతి బుధవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ చెప్పారు. భర్త వేధింపుల వలనే ప్రశాంతి ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లి పుప్పాల రాజ్యలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ఏరియా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు