భర్తను చికెన్‌ కోసం పంపి భార్య ఆత్మహత్య

15 May, 2019 11:00 IST|Sakshi
లక్ష్మీ మృతదేహం

కర్ణాటక, బళ్లారిఅర్బన్‌: బళ్లారి తాలూకాలోని  సింధ్వాళ్‌ గ్రామానికి చెందిన లక్ష్మి(28) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది.  మోకా సీఐ సన్న వీరేష్‌ తెలిపిన మేరకు వివరాలు.. గ్రామంలో రామాంజినేయులు తన భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు.  సోమవారం రాత్రి  భర్తను, పిల్లలను చికెన్‌ తేవాలని పంపిన లక్ష్మి.. ఇంట్లో ఉన్న ఫ్యానుకు ఉరేసుకుంది. కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన రామాంజనేయులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు