అనంతపురంలో మట్కా ముఠా అరెస్టు

9 Feb, 2018 11:22 IST|Sakshi

సాక్షి, అనంతపురం: అనంతపురంలో మట్కా ముఠా గుట్టు రట్టైంది. మట్కా నిర్వహిస్తున్న ఆరుగురుని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 20 లక్షలు, 4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని హుబ్లీ కేంద్రంగా హైటెక్‌ పద్దతిలో ఈ మట్కా దందా జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో నిఘా పెట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం కోసం విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు