మంచి నీరనుకుని..

20 Mar, 2018 11:17 IST|Sakshi
మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు

యాసిడ్‌ తాగి కార్మికుడి మృతి

ఇంకొల్లు స్పిన్నింగ్‌ మిల్లులో ఘటన..

ఇంకొల్లు: స్థానిక ఓ ప్రైవేట్‌ స్పిన్నింగ్‌ మిల్లులో కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం జరిగింది. ఎస్‌ఐ వి.రాంబాబు కథనం ప్రకారం.. చినగంజాం మండలం సంతరావూరు గ్రామానికి చెందిన నల్లమల శ్యాంసన్‌ (58) స్థానిక స్పిన్నింగ్‌ మిల్లులో కొంతకాలంగా పని చేస్తున్నాడు. రోజూ మాదిరిగానే మిల్లుకు వచ్చిన శ్యాంసన్‌ అన్నం తినే సమయంలో మంచినీరనుకుని బాటిల్‌లో ఉన్న యాసిడ్‌ తాగాడు. బాధితుడిని వెంటనే స్థానిక ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ శ్యాంసన్‌ మృతి చెందాడు. మృతుడి భార్య రమణమ్మ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వి.రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఇంకొల్లు సీఐ ఎం.శేషగిరిరావు పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

మరిన్ని వార్తలు