విద్యార్థినిపై గ్యాంగ్‌ రేప్‌

29 Jan, 2018 21:10 IST|Sakshi

సాక్షి, ఒడిశా‌: తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని(14)పై గుర్తుతెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం బౌద్‌ జిల్లా కాంటమాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కోడిబాహల్‌ గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బాధిత విద్యార్థిని తన మామ ఉండే గ్రామంలో ఓ వివాహానికి హాజరైంది.

తన అత్తతో కలిసి కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఊరి చివరకు వెళ్లింది. ఇది గమనించిన ఇద్దరు వ్యక్తులు బాలికను కిడ్నాప్‌ చేసి అడవిలోకి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారని, నిందితుల కోసం గాలిస్తున్నట్లు వివరించారు.

మరిన్ని వార్తలు