ఓ బాలిక, ఓ యువతి మిస్సింగ్‌!

25 Apr, 2019 09:25 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి : శంషాబాద్‌లో ఓ బాలిక, యువతి అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కిరాణా షాపుకు వెళ్లిన పదహారేళ్ల మైనర్‌ బాలిక తిరిగి రాలేదు. ఈ ఘటన ఊటుపల్లిలో చోటుచేసుకోగా.. సిద్దంతిలో ఉంటే 23 ఏళ్ల యువతి కూడా అదృశ్యమైంది. బేకరీలో పనికోసమని వెళ్లి తిరిగిరాలేదు. దీంతో ఆ యువతి తండ్రి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
 

మరిన్ని వార్తలు