మెంటాడ: మండలంలోని ఆండ్ర గ్రామానికి చెందిన కంఠు సుశీల (17) ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పురుగు మందు తాగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి.. సుశీల ఏడాది నుంచి కడుపునొప్పితో బాధపడుతోంది. నొప్పిన భరించలేకే పురుగు మందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు గజపతినగరం ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం సుశీలను ఆటోలో విజయనగరం తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలి తల్లి కన్నమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆండ్ర ఎస్సై ఎస్. భాస్కరరావు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.