-

చదువుకోవడం ఇష్టం లేక..

18 Jul, 2020 10:45 IST|Sakshi
విజయలక్ష్మి (ఫైల్‌)

కర్నూలు,మద్దికెర : ఇంటర్‌ చదవడం ఇష్టం లేక ఓ బాలిక బలవన్మరణానికి పాల్పడింది.  మండల పరిధిలోని ఎం.అగ్రహారం గ్రామంలో  శుక్రవారం ఈ సంఘటన జరిగింది. మృతురాలు విజయలక్ష్మి (16) ఎం. అగ్రహారం గ్రామంలోని అవ్వాతాతల వద్ద ఉండి చదువుకుంటుంది. తల్లిదండ్రులు నాగవేణి, శంకర్‌  హైదరాబాద్‌లో ఉంటారు. ఈ ఏడాది పదవతరగతి పూర్తికావడంతో ఇంటర్‌కు దరఖాస్తు చేసుకోవాలని కుమార్తెకు చెప్పారు. ఉన్నత విద్య అభ్యసించడం ఇష్టం లేని ఆ బాలిక శుక్రవారం ఇంట్లో  ఉరి వేసుకుంది.  గమనించిన కుటుంబసభ్యులు  వైద్య చికిత్స కోసం  ఆసుపత్రికి తరలించేలోపు  మృతిచెందింది. ఈమేరకు తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నట్లు మద్దికెర పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు