మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం

17 Dec, 2019 13:33 IST|Sakshi

సాక్షి, జైనూర్‌: కొమరం భీం జిల్లాలో మైనార్‌ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. మాయమాటలు చెప్పి.. బాలికను మభ్యపెట్టిన ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాలిక గర్భం దాల్చింది. జిల్లాలోని జైనూర్ మండలం శేకుగూడ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  మైనర్ బాలికపై సామూహికంగా అత్యాచారం చేసిన నిందితులు ఆత్రం ప్రభు (24), పెందూర్ శ్రీకాంత్ (19)పై బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన తన దృష్టికి రావడంతో నిందితులపై పోక్సో చట్టం కింద అభియోగాలు నమోదు చేసి కేసు పెట్టాల్సిందిగా జిల్లా డీఎస్పీ ఆదేశాలు ఇచ్చారు.

మరిన్ని వార్తలు