భర్త కళ్లెదుటే దారుణం..!

7 May, 2019 17:00 IST|Sakshi

జైపూర్‌ : గాంధీజీ కలలుగన్నట్టు మహిళలు అర్థరాత్రి నిర్భయంగా వీధుల్లో తిరగడం మాట అటుంచి.. పట్టపగలే రక్షణ లేకుండా పోతోంది. భర్తతో కలిసి బైక్‌పై వెళ్తున్న ఓ వివాహిత పట్టపగలు కామాంధుల అకృత్యానికి బలైంది. ఈ ఘటన రాజస్తాన్‌లోని ఆల్వార్‌ జిల్లాలో గత  నెల 26న చోటుచేసుకుంది. అయితే ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఈ విషయం మంగళవారం వెలుగుచూసింది. 

వివరాలు.. థానాఘాజీ-ఆల్వార్‌ బైపాస్‌ మీదుగా భార్యభర్తలు వెళ్తుండగా ఐదుగురు కీచకులు అడ్డగించారు. దంపతులపై దాడిచేసి నిర్మానుష్య ప్రాంతంలోకి ఈడ్చుకెళ్లారు. భర్త ఎదుటే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా జరిగిన అకృత్యాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మే 2నే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కింద కేసులు పెట్టామని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని చోటేలాల్‌, అశోక్‌గా గుర్తించామని, నిందితులను పట్టుకోవడానికి గాలింపు చర్యలు ముమ్మరం చేశామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు