ఘరానా దొంగ అరెస్ట్‌

20 May, 2019 17:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో టూవీలర్‌ చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను మియాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 18 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వివరాలు.. నేనావత్‌ చందర్‌ నాయక్‌ అనే వ్యక్తి బీఈడీ చదివాడు. ప్రస్తుతం అతడు స్విగ్గీలో ఫుడ్‌ డెలివరీబాయ్‌గా పని చేస్తున్నాడు. అయితే విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ చందర్‌కు చాలినంత జీతం రాకపోవడంతో చోరీలకు పాల్పడుతున్నాడని డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు