ఐదుగురు మృగాళ్లు

25 Dec, 2019 10:22 IST|Sakshi

బాలికపై 4 నెలలుగా అఘాయిత్యం

గర్భం దాల్చిన బాలిక.. బళ్లారిజిల్లాలో ఘోరం

దుండగులు అరెస్టు, మహిళ పరారీ  

కర్ణాటక, సిరుగుప్ప: బళ్లారి జిల్లా సిరుగుప్పలో దారుణం వెలుగుచూసింది. 14 ఏళ్ల బాలికపై కొన్నినెలలుగా కొందరు కామాంధులు సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు.  ఆలస్యంగా గుర్తించిన బాలిక తండిర సిరుగుప్ప పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కామాంధులను కటకటాల వెనక్కు పంపారు. దేశనూరు గ్రామంలో ఈ సంఘటన జరగ్గా, 6 మంది నిందితులపై పోలీసులు పోక్సో చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఐదుగురినిఅరెస్టు చేయగా, కీచకులకు సహకరించిన మహిళ పరారైంది. 

మహిళ మాయాజాలం  
బాలికకు తల్లి లేదు, తండ్రి కూలీకి వెళ్లేవాడు. ఇంట్లో ఒక్కతే ఉన్న బాలికను  అదే గ్రామానికి చెందిన నిర్మల అనే మహిళ స్నేహం చేసుకుంది. ఆటో అంజి, సిరుగుప్ప మల్లి అలియాస్‌ మల్లేశ్, హనుమేశ్, రాజు, రాఘవేంద్ర అనే వారికి బాలికను పరిచయం చేసింది. మాయమాటలతో బాలికను వశపరచుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 10వ తేదీ నుంచి ఈ నెల 20వ తేదీ వరకు బాలికపై అఘయిత్యాలు కొనసాగించారు. దేశనూరు రోడ్‌లో ఉన్న దర్గా వెనుక  ప్రతి రాత్రి సామూహికంగా అత్యాచారానికి ఒడిగట్టారు. ఫలితంగా బాలిక గర్భం దాల్చింది. బాలిక గర్భం దాల్చడంపై ఆరోగ్య కార్యకర్త ఆదోని లక్ష్మి గమనించి, ఆమె తండ్రికి తెలిపింది. సోమవారం బాలికను మహిళా ఆశ్రయ కేంద్రానికి తరలించారు. ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్య చికిత్సల కోసం బళ్ళారి విమ్స్‌కు తరలించారు. పరారీలో ఉన్న నిర్మల కోసం గాలిస్తున్నట్లు ఎస్‌.ఐ.గంగప్ప బుర్లి తెలిపారు.  

మరిన్ని వార్తలు