సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎల్బీ నగర్లో దారుణం చోటుచేసుకుంది. ఎల్బీనగర్లోని మన్సూరాబాద్లో ఆరేళ్ల చిన్నారి పాపపై ఓ కీచకుడు అఘాయత్యానికి ఒడిగట్టబోయాడు. ఎవరూలేని సమయంలో జానీ అనే 35 ఏళ్ల వ్యక్తి ఆరేళ్ల పాపపై అత్యాచారయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని పాప తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు పోలీసును ఆశ్రయించారు. జానీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడు జానీని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.