అత్యాచారం.. ఆపై నిప్పు

15 Dec, 2019 03:53 IST|Sakshi

చావుబతుకుల మధ్య బాధితురాలు

బండా (ఉత్తరప్రదేశ్‌): ఉన్నావ్‌లో అత్యాచార బాధితురాలిని నిందితులు సజీవ దహనం చేసిన ఘటన మరవకముందే అలాంటి దారుణం శనివారం యూపీలోని ఫతేపూర్‌ జిల్లాలో జరిగింది. ఫతేపూర్‌ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్నపుడు దూరపు బంధువు ఒకరు ఆమెను రేప్‌ చేసి, ఆమెకు నిప్పంటించాడు. బాధితురాలి ఆక్రందనలు విన్న చుట్టుపక్కల వారు ఆమెను దగ్గరలోని ఓ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. బాధితురాలు కాన్పూర్‌లోని ఓ ఆస్పత్రిలో 90% కాలిన గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

మరిన్ని వార్తలు