కూతురు ఫెయిలందని తల్లి ఆత్మహత్య

10 May, 2018 09:30 IST|Sakshi

మైసూరు: కుమార్తె పరీక్షల్లో ఫెయిలనందుకు తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన బుధవారం నగరంలోని ఇలవాలలో చోటు చేసుకుంది. నగరంలోని ఇలవాలకు చెందిన లక్ష్మీ,రాజు దంపతుల కుమార్తె ఇటీవల ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలు రాసింది. రెండు రోజుల క్రితం విడుదలైన ఫలితాల్లో కుమార్తె ఫెయిలవడంతో మనస్థాపం చెందిన లక్ష్మీ బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇలవాల పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు