యువకుడు, అతడికి సహకరించిన తల్లిపై కేసు నమోదు
మల్లాపూర్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిపై లైంగికదాడికి పాల్పడిన యువకుడితో పాటు అందుకు సహకరించిన అతడి తల్లిపై నాచారం పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ మహేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాప్రా ఈసీఐఎల్కు చెందిన యువతి(18) స్థానిక జూనియర్ కాలేజీలో రిసెప్షన్గా పని చేస్తోంది. ఆమెకు నాచారం హెచ్ఎంటినగర్కు చెందిన అబ్దుల్ మజీద్ ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. ఈ క్రమంలో ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పి పలుమార్లు తన ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో పెళ్లి చేసుకోవాలని బాధితురాలు నిలదీయడంతో అందుకు నిరాకరించడమేగాక తన వద్ద ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. అందుకు అబ్దుల్ మజీద్ తల్లి సలేహా సహీన్(45) కూడా సహకరించినట్లు తెలిపింది. అంతేకాకుండా తన వద్ద నుంచి రూ 60 వేలు నగదు, 7.5 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు అబ్దుల్ మజీద్, సలేహా సహీన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి 36 గ్రాముల బంగారం, బైక్, కారు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.