కుమారుడితోసహా తల్లి అదృశ్యం

8 Feb, 2020 10:24 IST|Sakshi
అదృశ్యమైన తల్లీ, కొడుకు

అడ్డగుట్ట: ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిన తల్లీకొడుకులు అదృశ్యమయ్యారు. ఈ ఘటన తుకారాంగేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.  ఎస్‌ఐ శ్రీను తెలిపిన మేరకు.. తుకారాంగేట్‌ సాయినగర్‌ ప్రాంతానికి చెందిన నారపాక భాగ్యశ్రీ(22) తన ఏడు నెలల బాలుడు క్రిష్‌తో కలిసి శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో  ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె భర్త గిరిధర్‌ పరిసర ప్రాంతాల్లో వెతికినా, తెలిసిన వారిని వాకబు చేసినా ఫలితం కనిపించలేదు. దీంతో  తుకారాంగేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరిన్ని వార్తలు