తల్లీబిడ్డల అదృశ్యం

5 Jun, 2020 12:47 IST|Sakshi

చిత్తూరు, పీలేరు రూరల్‌ :  పీలేరు పట్టణం కావలిపల్లెకు చెందిన రెడ్డెప్ప ఆచారి భార్య భువనేశ్వరి, కుమారులు హేమంత్‌కుమార్, వసంతకుమార్‌ అదృశ్యమయ్యారు. పలుచోట్ల వెతికినా ఆచూకీ లేకపోవడంతో రెడ్డెప్ప ఆచారి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భువనేశ్వరి ఇద్దరి కుమారులతో మే 31న మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిందని, తిరిగి రాలేదని పేర్కొన్నాడు. వీరి ఆచూకీ తెలిసిన వారు 9440796744, 9440796745లకు సమాచారం ఇవ్వాలని పీలేరు అర్బన్‌ సీఐ సాదిక్‌వలి తెలిపారు.

మరిన్ని వార్తలు