దూద్బౌలి: పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఓ మహిళ బిడ్డను అక్కడే వదిలేసి వెళ్లిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. చార్మినార్ ఎస్ఐ నర్సింగ్రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.ఈ నెల 7న ఫలక్నుమా ప్రాంతానికి చెందిన మహ్మదీ బేగం ప్రసవం నిమిత్తం ఆసుపత్రిలో చేరింది. అదే రోజు మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కొద్ది సేపటికే అక్కడినుంచి వెళ్లిపోయింది.
రెండు రోజుల పాటు వేచి చూసిన ఆసుపత్రి అధికారులు శనివారం చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. ఆదివారం ఫలక్నుమా ప్రాంతంలో ఆమె కోసం గాలించగా ఆధారాలు లభించలేదు. దీంతో ఆమె ఆసుపత్రిలో చేరిన సమయంలో తప్పుడు అడ్రస్ ఇచ్చి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. చిన్నారిని శిశు విహార్కు తరలించనున్నట్లు వైద్యులు తెలిపారు.