ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం

16 May, 2018 11:12 IST|Sakshi
పల్లవి

జీడిమెట్ల: భర్త మందలించడంతో ఓ గృహిణి ఇద్దరు కుమార్తెలను తీసుకొని  ఇంటినుండి వెళ్లిపోయింది. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.  ఎస్‌ఐ శ్రీనివాస్‌ వివరాల ప్రకారం.. చింతల్‌ మల్లికార్జున నగర్‌కు చెందిన మురళికృష్ణరెడ్డి, పల్లవి(29) భార్యభర్తలు వీరికి ఇద్దరు కుమార్తెలు సాన్వి(3), మనస్విని(4) ఇద్దరు కూతుళ్లు. గత నెల 16వ తేదీన రామకృష్ణరెడ్డి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పల్లవి వేరే వ్యక్తితో ఇంట్లో మాట్లాడుతుంది. అదేరోజు రామకృష్ణరెడ్డి భార్యను మందలించాడు. తిరిగి 29వ తేదీన అదే విధంగా మాట్లాడుతుండటంతో గట్టిగా మందలించాడు. మరునాడు ఉదయం కారమకృష్ణరెడ్డి డ్యూటీనుండి వచ్చే సరికి పల్లవి తన ఇద్దరు కూతుళ్లతో పాటు ఇంట్లో ఉన్న సామాన్లు తీసుకుని వెళ్లిపోయింది. వారి కోసం గాలించిన అచూకీ తెలియకపోవడంతో మంగళవారం రామకృష్ణరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు