విషాదం: ఇద్దరు పిల్లతో సహా తల్లి ఆత్మహత్య

1 Jun, 2018 08:00 IST|Sakshi

సాక్షి, గుంటూరు: జిల్లాలోని పొన్నూరులో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం ఇద్దరు పిల్లలతో సహా ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఓ తల్లి నిప్పంటించుకుంది. తల్లి శారద, పిల్లలు ప్రకాష్‌ వర్మ(7), శ్రేష్ట(11) మృతిచెందారు. శారద ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే అతని నిన్న వివాహం జరిగింది. దీనికి మనస్థాపం చెందిన శారద పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలిసిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు