ముంబై: మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తన సోదరిని అసభ్యకరంగా చిత్రీకరించింది. అనంతరం ఆ దృశ్యాలను తన ప్రియుడికి పంపి మానవ సంబంధాలను మంటగలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. వివరాలు... బాధితురాలు తన సోదరి(25), కుటుంబంతో కలిసి ముంబైలోని బైకుల్లాలో నివసిస్తోంది. ఈ క్రమంలో బుధవారం బాధితురాలు స్నానానికి వెళ్లగా.. ఆమె సోదరి అక్కడే తన బాయ్ఫ్రెండ్తో వీడియో కాల్ మాట్లాడింది. దీంతో అతడు ఆ దృశ్యాలను స్క్రీన్ షాట్ చేసి.. సేవ్ చేసుకున్నాడు. అనంతరం వాటిని యువతి బంధువులకు షేర్ చేసి ఆమె వ్యక్తిత్వంపై నిందలు వేశాడు. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమె సోదరి, ప్రియుడిపై కేసు నమోదు చేశారు.
కాగా దేవీ నవరాత్రుల సమయంలో బాధిత యువతి తనను అవమానించినందుకు ప్రతీకారంగా... తన సోదరి నగ్న చిత్రాలను పంపించాలంటూ ఆమె సోదరి ప్రియుడు బ్లాక్మెయిల్ చేశాడు. అవి పంపించకపోతే తనను పెళ్లి చేసుకోనంటూ ఆమెను బెదిరించాడు. ఈ నేపథ్యంలోనే తాను ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్లు నిందితురాలు పోలీసులకు తెలిపింది.