యువతిపై సహోద్యోగి అత్యాచారం

5 Dec, 2019 22:25 IST|Sakshi

జైపూర్‌ : మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ వారిపై దాడులు మాత్రం ఆగడంలేదు. తాజాగా ఓ యువతిపై సహోద్యోగి అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. ముంబైకి చెందిన ఓ 19ఏళ్ల యువతి హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు శిక్షణ నిమిత్తం కోసం జైపూర్‌కు వచ్చారు. గత వారం ఓ క్లబ్‌లో స్నేహితులు ఏర్పాటు చేసిన పార్టీకి  హాజరయ్యారు. ఆమె సహోద్యోగి కూడా ఆ పార్టీకి హాజరయ్యాడు. పార్టీ అనంతరం ఆమెను హోటల్‌ సమీపానికి తీసుకెళ్లిన దుండగుడు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జైపూర్‌ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. 

మరిన్ని వార్తలు