మహిళ హత్య కేసులో వీడిన మిస్టరీ
నిందితుడి అరెస్ట్, రిమాండ్
సైదాబాద్: ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన కేసులో నిందితుడిని సైదాబాద్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నగర పోలీస్కమిషనర్ అంజనీకుమార్ సైదాబాద్ పోలీసులతో కలిసి సోమవారం వివరాలు వెల్లడించారు. నల్లగొండ జిల్లా, చింతపల్లి మండలం, పుల్యానాయక్ తండాకు చెందిన రమావత్ సక్రునాయక్ నగరానికి వచ్చి అడ్డాకూలీగా పని చేసేవాడు. తరచూ నగరానికి వచ్చే అత ను ఫుట్పాత్లపై నిద్రించేవాడు. ఈ క్రమం లో చంపాపేటలోని ఓ వైన్షాప్ వద్ద సేవిస్తుండగా అదే మండలం ఉమ్మంతలపల్లి గ్రామానికి చెందిన మదిగొండ అంజమ్మ (50)తో పరిచయం ఏర్పడింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త చంద్రయ్యకు దూరంగా ఉం టున్న అంజమ్మ చింతల్బస్తీలోని అక్క కూతు రు ముత్యాలు ఇంట్లో ఉండేది.
ఈనెల 11న చింతల్బస్తీ సమీపంలోని వైన్స్ షాప్ వద్ద మద్యం కొనుగోలు చేసిన ఇద్దరు మద్యం తాగేందుకు టెలిఫోన్ కాలనీలోని ఖాళీ స్థలంలోకి వచ్చారు. అనంతరం అంజమ్మపై సక్రు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం రూ. 500 ఇవ్వాలని అంజమ్మ డిమాండ్ చేయగా మద్యానికే రూ. 400 ఖర్చయ్యాయని తన వద్ద డబ్బులు లేవని సక్రు చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన సక్రునాయక్ అంజమ్మ తలపై బండరాయితో మోదడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు సక్రుగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకోని విచారించగా నేరం అంగీకరించడంతో సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీపీ తెలిపారు. ఈ కేసును చేధించిన సైదాబాద్ పోలీసులతో పాటు ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులను సీపీ అభినందించారు.