యువకుడి వేధింపులు..యువతి ఆత్మహత్య

25 May, 2018 08:30 IST|Sakshi
ధన్యా(ఫైల్‌)

మైసూరు : యువకుడి వేధింపులు తట్టుకోలేక యువతి  ఆత్మహత్య చేసుకున్న సంఘటణ మైసూరు నగరం సమీపంలో ఉన్న బెళవాడిలో గురువారం చోటు చేసుకుంది.  బెళవాడ  గ్రామానికి చెందిన ధన్యా(19) మేటెగళ్లి ప్రాంతానికి చెందిన దీను అనే యువకుడిని ప్రేమించింది.  ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా కొంత కాలం దూరంగా ఉంటున్నారు. అయితే కొద్ది రోజులుగా మళ్లీ దీనా ధన్య వెంటపడుతున్నాడు.   ధన్యా తల్లిదండ్రులు దీనాను మందలించారు. అయినప్పటికీ దీనా వేధింపులు మానుకోలేదు.  మనో వేదనకు గురైన ధన్యా గురువారం సూసైడ్‌ నోట్‌ రాసి ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.   విజయనగర పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. 

మరిన్ని వార్తలు