విషాదం....

30 Aug, 2018 13:12 IST|Sakshi
ఆస్పత్రికి వస్తున్న జగపతిబాబు

నల్గొండ : టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు, సినీ నటుడు నందమూరి హరికృష్ణ అకాల మృతితో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విషాదం నెలకొంది. బుధవారం నల్లగొండ జిల్లా అన్నెపర్తి సమీపంలో నార్కట్‌పల్లి- అద్దంకి రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం, గతంలో అతని కుమారుడు జానకీరామ్‌ కూడా కోదాడ సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ప్రజలు, అభిమానులు కన్నీటిపర్యంతమయ్యారు.   
 

మరిన్ని వార్తలు