మార్కాపురంలో పేలిన నాటు బాంబు

14 Apr, 2019 20:26 IST|Sakshi

సాక్షి, ప్రకాశం: జిల్లాలోని మార్కాపురం ఎస్సీబీసీ కాలనీలో నాటు బాంబు పేలడం కలకలం రేపింది. ఆటోలో నుంచి నాటు బాంబు జారిపడి పేలుడు జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. వెంటనే సదురు వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి కొద్ది దూరంలోనే మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కేపీ కొండారెడ్డి నివాసం ఉంది. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు