గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం

16 Oct, 2018 13:30 IST|Sakshi

సాక్షి, గుంటూరు : గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి (జీజీహెచ్‌)లో దారుణం చోటుచేసుకుంది. మహిళకు కాన్పు చేయించటంలో వైద్యులు నిర్లక్ష్యం వహించడం వల్ల శిశువు మృతి చెందింది.  తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు శిశువు మృతదేహన్ని త్వరగా తీసుకెళ్లాలని వైద్యులు ఆదేశించారు. అంతటితో ఆగకుండా రూ. 500 ఇస్తేనే మృత దేహాన్ని అప్పగిస్తామని బాధితులను సిబ్బంది బెదిరించారు. బాధితులు ఈ విషయాన్ని సూపరింటెండెంట్‌కు తెలియజేసినా పట్టించుకోలేదు. దీంతో ఆస్పత్రి ముందు బాధితుల బంధువులు ఆందోళనకు దిగారు.  తమ బిడ్డ  శరీరంపై గాయాలయ్యాయని, వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోంచారు. 

మరిన్ని వార్తలు