పెళ్లైన 6 నెలలకే నవ వధువు ఆత్మహత్య..!

3 Mar, 2019 10:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వనస్థలీపురంలో విషాదం చోటుచేసుకుంది. నవ వధువు భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సుష్మసాయి నగర్‌లో ఆదివారం జరిగింది. మృతురాలిని నివేదితగా గుర్తించారు. భర్తతో రాత్రి జరిగిన గొడవ కారణంగానే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 6 నెలల క్రితకే నివేదితకు వివాహం అయింది.

మరిన్ని వార్తలు