సాక్షి, కృష్ణా జిల్లా : వివామైన 3 నెలలకే నవదంపతులు ఆతహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని ముసునూరు మండలం కాట్రేనిపాడులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మేసుపాము శివరామకృష్ణ (32), భార్య నాగమల్లేశ్వరి (24)లు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న ముసునూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది