వివాహమైన మూడు నెలలకే..

21 Dec, 2019 10:50 IST|Sakshi
అంజలితో అయ్యనార్‌ (ఫైల్‌)

తమిళనాడు ,తిరువొత్తియూరు: కుటుంబ కలహాల వల్ల వివాహమైన మూడు నెలలకే నవ వధువును హత్య చేసిన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై పల్లికరనై సమీపం పెరుంబాక్కం పశుంపొన్‌ నగర్‌ కన్నిగై వీధికి చెందిన అంజలి (21). ఈమెకు అయ్యనార్‌ (31)తో 2.8.2019న వివాహమైంది. అయ్యనార్‌ మేడవాక్కంలో ఉన్న ప్రముఖ జౌళి దుకాణం కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు అంజలి బంధువు కళ తిరువణ్ణామలైలో మృతి చెందడంతో ఆమెను చూడడానికి వెళ్లాలని అంజలి భర్తను కోరింది. కానీ వివాహమై మూడు నెలలు అవుతున్నదని, అలాంటి దుఃఖకార్యక్రమాలకు వెళ్లకూడదని అయ్యనార్‌ చెప్పినట్టు తెలిసింది. దీనిపై భార్య, భర్తల మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఆగ్రహించిన అయ్యనార్‌ భార్యపై దాడి చేసినట్టు తెలిసింది. ఆ సమయంలో అయ్యనార్‌ భార్య గొంతు గట్టిగా పట్టుకోవడంతో ఆమె స్పృహతప్పి కింద పడిపోయింది. దిగ్భ్రాంతి చెందిన అయ్యనార్‌ ఆమెను బంధువుల సాయంతో చికిత్స కోసం అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరిశోధించిన వైద్యులు అంజలి అప్పటికే మృతి చెందినట్టు తెలిసింది.

>
మరిన్ని వార్తలు