మలేషియాలో ఇరుక్కుపోయిన నిజామాబాద్‌ వాసులు

27 Jul, 2018 12:26 IST|Sakshi

నిజామాబాద్ : మలేషియాలో 10 మంది నిజామాబాద్ వాసులు ఇరుక్కుపోయారు. ఓ గల్ఫ్‌ ఏజెంట్‌, రూ.35 వేలు జీతం అని చెప్పి విజిట్ వీసాలతో పది మందిని మలేషియా పంపించాడు. మలేషియాలో తిండీ గూడు లేక తిరిగొచ్చేందుకు డబ్బులు నరకయాతన పడుతున్నారు. బాధితుల స్వస్థలం బాల్కొండ మండలం జక్రాన్ పల్లి. రూ.60 వేలు కట్టబెట్టి వచ్చినా నిలువునా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని వాట్సప్ వీడియోల ద్వారా బంధువులకు, స్నేహితులకు సమాచారం పంపారు. ఈ సమాచారం తెలియడంతో బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.

మరిన్ని వార్తలు