పోలీసులకు నాన్‌బెయిలబుల్‌ వారంట్‌

22 Dec, 2017 14:06 IST|Sakshi

సాక్షి, జగ్గయ్యపేట: జగ్గయ్యపేట సీఐ, ఎస్‌ఐ, కానిస్టేబుల్‌కు స్థానిక కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేసింది. సాంబశివరావు అనే వ్యక్తిని నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని వీరిపై ఆరోపణలున్నాయి. ఈ మేరకు సీఐ లచ్చునాయక్‌, ఎస్సై ప్రియకుమార్‌, కానిస్టేబుల్‌ హరిబాబుకు ఈ వారంట్‌ జారీ అయింది. సమన్లు జారీ చేసినా కోర్టుకు హాజరుకాకపోవడంతో వీరికి న్యాయమూర్తి నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారంట్‌ జారీ చేశారు.

మరిన్ని వార్తలు