కూర రాజన్నకు నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌

20 Feb, 2018 03:16 IST|Sakshi

సిరిసిల్ల: సీపీఐ(ఎంఎల్‌) జనశక్తి ఉద్యమ నిర్మాత కూర రాజన్న(70)కు రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్టు సోమవారం నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేసింది. కోనరావుపేట మండలం సుద్దాలలో ఏనుగు ప్రభాకర్‌రావు హత్య కేసులో రాజన్న నిందితుడు. 2013 నాటి ఈ కేసులో రాజన్న కోర్టుకు హాజరు కాకపోవడాన్ని తప్పుపడుతూ తొమ్మిదో జిల్లా కోర్టు న్యాయ మూర్తి జి.శ్రీనివాసులు నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేశారు. వేములవాడకు చెందిన కూర రాజేందర్‌ ఉరఫ్‌ కూర రాజన్న జనశక్తి ఉద్యమ నిర్మాత. ఆయన ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌ కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మరిన్ని వార్తలు