ఐదేళ్ల బాలికపై అత్యాచారం
పోలీసుల అదుపులో నిందితుడు
పొదలకూరు: పట్టణంలోని విఘ్నేశ్వరపురం కాలనీకి చెందిన ఐదేళ్ల బాలికపై అదే కాలనీలో నివాసం ఉంటున్న సమీప బంధువు లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక బంధువులు అనుమానించి నిందితుడిపై శుక్రవారం దాడికి యత్నించారు. పోలీసులు, బాలిక తల్లిదండ్రుల కథనం మేరకు.. ఐదేళ్ల బాలికకు రెండు రోజులుగా జ్వరం వస్తుంటే బాలిక తండ్రి చిరంజీవి డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. డాక్టర్ పరీక్షలు నిర్వహించి బాలిక మర్మాంగంలో ఇన్ఫెక్షన్ సోకిందని, అత్యాచారం జరిగిఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
దీంతో బాలికను ప్రశ్నించగా ఇంటి సమీపంలో ఉన్న బంధువు కృష్ణయ్య(50) తన ఇంటికి వెళ్లిన సమయంలో అసభ్యంగా ప్రవర్తించేవాడని తెలిపింది. దీంతో కాలనీవాసులు, బాలిక బంధువులు కృష్ణయ్య ఇంటి వద్ద గుమిగూడి అతడిపై దాడి చేసేందుకు యత్నించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని కృష్ణయ్యను అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. సీఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్సై అల్లూరు జగత్సింగ్ పోలీస్స్టేషన్లో లేకపోవడంతో వారు వచ్చి న తర్వాత కేసును సమగ్రంగా విచారించి చర్యలు తీసుకుంటామని సిబ్బంది వెల్లడించారు.