మద్యం షాపు వద్ద ఘర్షణ.. బీర్‌ బాటిల్‌తో..

14 May, 2019 20:46 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, గుంటూరు : మద్యం షాపు వద్ద ఘర్షణ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బీర్‌బాటిల్‌తో గొంతుకోయడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. వివరాలు.. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం షాపు వద్ద ఇద్దరు వ్యక్తులు (పూర్ణ శేఖర్‌, రమేష్‌) ఘర్షణకు దిగారు. దీంతో కోపోద్రిక్తుడైన రమేష్‌.. బీర్‌ బాటిల్‌తో పూర్ణ గొంతుకోసి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు