జీపు, బైక్‌ ఢీ: ఒకరు మృతి

19 Jan, 2018 17:35 IST|Sakshi

సాక్షి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాజన్న గుడి చెరువు కట్ట కింది బస్టాండ్ సమీపంలో తుఫాన్‌ జీపు, బైక్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడిని లక్క సుజిత్ రెడ్డి(30)గా గుర్తించారు. వాసవి నగర్‌కు చెందిన ఇతని స్వగ్రామం పొత్కపల్లి కాగా వేములవాడలో డీసీఎం వ్యాన్ డ్రైవర్‌గా ఉపాధి పొందుతూ పదేళ్లుగా ఇక్కడే నివసిస్తున్నాడు.

మరిన్ని వార్తలు