డాక్టర్‌ కృష్ణంరాజు కుటుంబం ఆత్మహత్య..!

30 Aug, 2019 12:33 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలోని అమలాపురంలో విషాదం నెలకొంది. ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్‌ పెనుమత్స రామ కృష్ణంరాజు అలియాస్‌ కృష్ణంరాజు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నారు. డాక్టర్‌ కృష్ణంరాజు(55), ఆయన భార్య లక్ష్మీదేవి (45), పెద్ద కుమారుడు కృష్ణసందీప్‌ (25) బలవన్మరణానికి పాల్పడ్డారు. కృష్ణసందీప్‌ ఇటీవలే ఎంబీబీఎస్‌ పూర్తి చేసినట్టు సమాచారం. రెండో కొడుకు కృష్ణవంశీ రాజానగరంలోని జీఎస్‌ఎల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ చదువుతున్నాడు.

ఆర్థిక ఇబ్బందులే ఈ ఆత్మహత్యలకు కారణాలుగా పోలీసులు భావిస్తున్నారు. పాయిజన్‌ ఇంజక్షన్‌ తీసుకోవడంతో ముగ్గురూ ప్రాణాలు విడిచినట్టు తెలుస్తోంది. అమలాపురంలోని సొంతింటిలో కృష్ణంరాజు కుటుంబం విగతజీవులుగా పడిఉండటాన్ని గమనించిన వారి ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ లభించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు