తహశీల్దార్‌ కార్యాలయంలో కత్తులతో దాడి

26 Dec, 2019 15:26 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, వైఎస్సార్‌ : వైఎస్సార్‌ జిల్లా ఒంటిమిట్ట తహశీల్దార్‌ కార్యాలయంలో భూ వివాదంపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సందర్భంలో అక్కడే ఉన్న అనిల్‌కుమార్‌ రెడ్డి వర్గీయులు నరసింహారెడ్డి వర్గీయులపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. కాగా ఈ దాడిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, ఇద్దరకి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డవారిని కడప రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. కాగా, దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు