ఆన్‌లైన్‌ ద్వారా ఘరానా మోసం; యువకుల అరెస్టు

22 Feb, 2020 14:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జగిత్యాల : ఆన్‌లైన్‌ షాపింగ్‌తో ఘరానా మోసానికి పాల్పడిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. జాగిత్యాలకు చెందిన కట్ట అరుణ్‌ కాంత్‌, వేణుమాధవ్‌, మొహసిన్‌లు అమెజాన్‌ ఆన్‌లైన్‌ షాపింగ్‌ ద్వారా రూ. 8లక్షల విలువైన వస్తువులను కొనుగోలు చేశారు. అనంతరం వస్తువులు సరిగా లేవని అవి తీసేసి వాటి స్థానంలో నకిలీ వస్తువులను ఖాళీ డబ్బాల్లో పెట్టి అమెజాన్‌కు తిరిగి పంపించారు. కాగా అమెజాన్‌ ప్రతినిధులు తిరిగి వచ్చిన డబ్బాలను తెరిచి చూడగా నకిలీ వస్తువులు ఉండడంతో తాము మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని సెక్షన్‌ 406,420 కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు