హైదరాబాద్: దుర్గగుడి ట్రస్ట్ బోర్డుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో చీరపోయినందుకు ట్రస్ట్ బోర్డు మెంబర్గా తీసివేయడాన్ని సవాలు చేస్తూ ట్రస్టు బోర్డు మెంబర్ కోడెల సూర్యలతా కుమారి పిటిషన్ వేసింది. పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు, దుర్గ గుడి ఈవో, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోన్మెంట్, ట్రస్ట్ బోర్డులకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో పూర్తి నివేదిక సమర్పించాలని ధర్మాసం కోరింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.