పాలిష్‌ వేస్తానని మస్కా- మహిళ అరెస్ట్‌

7 Feb, 2018 19:32 IST|Sakshi

సాక్షి, హొసూరు: కాలిగొలుసుకు పాలిష్‌ వేస్తానని మోసం చేసిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలివి.. కిష్టగిరి సమీపంలోని నాగర్‌కట్ట గ్రామానికి చెందిన వనిత(30) బుధవారం వీధిలో తిరుగుతూ పాలిస్‌ వేస్తానని చెబుతూ వెళ్లింది. ఆ సమయంలో  అదే ప్రాంతానికి చెందిన దీపిక తన కొడుకు కాలులోని గొలుసులకు పాలిష్‌ వేయమని ఇచ్చింది. అయితే పాలిష్‌ వేసిన తర్వాత గొలుసులు తక్కువ బరువు రావడంతో వనితను నిలదీసింది.

దీనికి సమాధానంగా ఆ మహిళ అంతే పాలిష్‌ వేస్తే బరువు తక్కువగానే వస్తుందని ఆమె బదులిచ్చింది. దీంతో దీపిక స్థానికుల సాయంతో వనితను బంధించి పోలీసులకు అప్పగించారు. పోలీసులు వనితను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు