మహిళ గొంతు కోసి పరారైన యువకుల అరెస్టు

14 Jul, 2018 14:47 IST|Sakshi

సాక్షి, విజయవాడ : సత్యనారాయణపురంలోని ఓ ఇంట్లోకి ప్రవేశించి మహిళను హత్య చేసేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడిన ఇద్దరు యువకులను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారం క్రితం సత్యనారాయణపురంలో చోరీకి యత్నించింది కూడా వీరేనని పోలీసులు నిర్ధారించారు. బీఆర్టీఎస్‌ రోడ్డులోని సీసీటీవీలో నిందితుల చిత్రాలు స్పష్టంగా కనిపించడంతో వారిని సులువుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. యువకులను లోతుగా విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా శుక్రవారం పద్మావతి ఇంటికి వచ్చిన ఈ ఇద్దరు నిందితులు దొంగతనం చేసేందుకు ప్రయత్నించారు. ఆమె ఎదురు తిరగడంతో గొంతు కోసి పరారయ్యారు.

మరిన్ని వార్తలు