మహిళా ఉద్యోగిపై దాడి.. ప్రముఖ బాక్సర్‌పై కేసు

14 Jun, 2018 14:16 IST|Sakshi

చండీగఢ్‌ : మహిళా ఉద్యోగిపై దాడి చేశారని ప్రముఖ బాక్సింగ్‌ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహిత జై భగవాన్‌పై హరియాణా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒలంపిక్‌ విజేత జై భగవాన్‌ ఫతేహాబాద్‌లో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఆయన ​కుటుంబ సభ్యులకు హిసార్‌లో లోని లక్ష్మీవిహార్‌ సమీపంలో మద్యం షాపు ఉంది. నిబంధనలకు విరుద్దంగా మద్యం అమ్ముతున్నారని ఆరోపనలు రావడంతో ఎక్సైజ్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. గత నెల 19న రాత్రి 9 గంటలకు హీసార్‌ మహిళా ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీవిహార్‌కు చేరుకొని మద్యం షాపు డాక్యుమెంట్లను చూపించాలని కోరారు.

ఆ సమయంలో అక్కడే ఉన్న జైభగవాన్‌ ఆమెపై దాడికి పాల్పడ్డారు. నిబంధనల ప్రకారమే మద్యం విక్రయిస్తున్నామంటూ ఆమెను అడ్డుకున్నారు. తన మనుషులతో ఆమెను చుట్టుముట్టారు. అసభ్యకరపదజాలంతో దూషించారు. గంటకు పైగా ఆమె కారును చుట్టిముట్టారు.

దీంతో ఈ విషయాన్ని ఆమె పై అధికారుల వద్దకు తీసుకెళ్లారు. జై భగవాన్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా హిసార్‌ డిప్యూటీ ఎక్సైజ్ అండ్ టాక్సేషన్ కమిషనర్‌(డీఈటీసీ) ని కోరారు. జై భగవాన్‌ వివాదంపై విచారణ చేపట్టాల్సిందిగా డీఈటీసీ హిరాస్‌ ఎస్పీని ఆదేశించారు. దీంతో ఈ నెల జూన్‌12 న భగవాన్‌పై కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు