హైటెక్‌ పేకాట.. కోట్లు దండుకుంటున్న వైనం

20 Jan, 2018 12:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో హైటెక్‌ పేకాట ముఠా గుట్టు రట్టయింది. అత్యాధునిక సాంకేతిక పరికరాలతో పేకాట నిర్వహిస్తూ.. ప్రజలకు కుచ్చుటోపీ పెడుతున్న మోసగాళ్లను జుబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. మైక్రో సెన్సార్లు, డిజిటల్‌ కనెక్షన్లు, ముబైల్‌ ఫోన్లతో ట్యాగింగ్‌ చేసి అత్యాధునిక రీతిలో ఈ ముఠా పేకాట నిర్వహిస్తోం‍ది. ఈ హైటెక్‌ బాగోత ద్వారాకోట్ల రూపాయలు నిర్వాహకులు దండుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు. హైటెక్‌ పేకాట నిర్వహిస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు