అగర్వాల్‌ హత్య కేసును ఛేదించిన పోలీసులు

25 Aug, 2018 11:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ క్రైమ్‌ : రాజేంద్రనగర్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. రాజేంద్రప్రసాద్‌ అగర్వాల్‌ ఇంట్లో చోరి చేసి, అతన్ని హత్య చేసిన ఘటనలో నిందితులను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర పనిచేసే పట్నాకు చెందిన డ్రైవర్‌.. ఈ దోపిడీకి ప్లాన్‌ చేసి తన గ్యాంగ్‌తో ఇక్కడికి వచ్చాడని పోలీసులు తెలిపారు. దోపిడీ చేసే క్రమంలో అగర్వాల్‌ నోటికి ప్లాస్టర్‌ వేయడంతో ఊపిరాడక మరణించినట్టు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 

మరిన్ని వార్తలు