బాలిక కిడ్నాప్‌ కేసును ఛేదించిన పోలీసులు

11 Jul, 2019 14:49 IST|Sakshi
చిన్నారి వైష్టవి(ఫైల్‌) సీసీ కెమెరా దృశ్యాలు

సాక్షి, హైదరాబాద్‌ : నిన్న లంగర్ హౌస్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిథిలో కిడ్నాప్‌కు గురైన 5 సంవత్సరాల బాలిక వైష్ణవి ఆచూకీ లభ్యమైంది. కిడ్నాప్ చేసిన వ్యక్తిని పోలీసులు ట్రేస్ చేశారు. చిన్నారి తండ్రి చిరంజీవే బంధువులతో పాపను కిడ్నాప్ చేయించినట్లు వారు గుర్తింపు. వికారాబాద్ జిల్లా  కొడంగల్‌లో కిడ్నాపర్‌ ఉన్నట్లు కనుగొన్నారు. కిడ్నాప్ చేసిన వ్యక్తిని పకీరప్పగా గుర్తించిన పోలీసులు.. అతడు కొడంగల్ మండలం అంగడి రాయచూరు గ్రామంలో ఉన్నట్లు తేల్చారు.

మరిన్ని వార్తలు