అటెన్షన్‌ డైవర్షన్‌ గ్యాంగ్‌ అరెస్ట్‌

23 Aug, 2019 22:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈస్ట్‌ జోన్‌లో అటెన్షన్‌ డైవర్షన్‌ గ్యాంగ్‌ను పోలీసు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ గ్యాంగ్‌కు చెందిన ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేశామని.. వారి నుంచి సుమారు రూ. 12 లక్షల రూపాయల నగదును స్వాదీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసులో అబిద్ మోహినుద్దీన్, షేక్ అబ్దుల్ బాసిత్, సంబరం రాజేష్‌లను అరెస్ట్ చేశామన్నారు. రాజేష్‌ కుమార్‌ బగడియా అనే వ్యక్తిని ఈ ముఠా మోసం చేసిందని పేర్కొన్నారు. పాత నోట్లను మార్పిడి చేస్తామంటూ.. రాజేష్‌ను నమ్మించారని చెప్పారు. రెండు రోజుల్లో ఈస్ట్‌ జోన్‌ పోలీసులు ఈ కేసును చేధించారని సీపీ పేర్కొన్నారు. 
 

మరిన్ని వార్తలు