జూబ్లీహిల్స్‌లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు

24 Mar, 2018 09:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : నగరంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ చెక్ పోస్టు వద్ద శుక్రవారం అర్ధరాత్రి నుంచి పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి వారి నుంచి వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో మొత్తం 38 బైక్‌లు, 38 కార్లు, రెండు ఆటోలు సీజ్‌ చేశామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు