ఢీ కొట్టిన వాహనం.. కానిస్టేబుల్‌ మృతి

15 Jun, 2019 07:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, వైఎస్సార్‌జిల్లా : విధులు నిర్వహిస్తుండగా పోలీస్‌ కానిస్టేబుల్‌ అకాలమరణం చెందాడు. వేగంగా వచ్చిన ఓ కారు.. బోయనపల్లి వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో మాన్నూరు హెడ్‌ కానిస్టేబుల్‌ మనోహర్‌(50) మృతి చెందగా.. పోలీస్‌ జీప్‌ డ్రైవర్‌ తృటిలో తప్పించుకున్నాడు.  మృతుడు కడప జిల్లా చెన్నూరుకు చెందిన వ్యక్తిగా ఎస్సై మహేష్‌ నాయుడు తెలిపారు. ఢీకొట్టిన వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

>
మరిన్ని వార్తలు